వివిధ అంశాలపై చర్చించేందుకు మరియు ఆమోదించేందుకుగాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 9న ముఖ్యమంత్రి అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో క్యాబినెట్ భేటీ నిర్వహించింది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలకు సంబంధించి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
జూలై 9 2025న క్యాబినెట్ ద్వారా ఆమోదించబడిన కీలక అంశాలు
- > అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటు
- > నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్కు, సరిహద్దుల విస్తరణ తదితర నిర్ణయాలకు ఆమోదముద్ర..అదనంగా 790 ఎకరాల స్థల సేకరణకు క్యాబినెట్ ఆమోదం
- > హడ్కో నుంచి తీసుకున్న రుణాలకు గ్యారంటీ ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం
- > అమరావతిలో వరల్డ్ ఎకానమీ ఫోరం నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదముద్ర
- > కుళాయి నీరు అందించేందుకు రూ.10వేల కోట్ల రుణాల సమీకరణకు క్యాబినెట్ అనుమతి
- > ఏపీ స్పేస్ పాలసీ 2025-30కి మంత్రివర్గం ఆమోదముద్ర
- > గ్రీన్ టాక్స్ ను రూ.3వేల వరకు తగ్గింపు
- > గత రబీ సీజన్లో కొనుగోలు చేసిన దాన్యం బకాయిలు 672 కోట్లు విడుదల
|ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానెల్లో జాయిన్ అవ్వండి.
Leave a Reply