“విజయ్ సేతుపతి” తో జత కట్టనున్న ‘బాలీవుడ్ క్వీన్ బ్యూటీ’…

బాలీవుడ్ సంచలన నటి “కంగానా రనౌత్” హిందీ చిత్రాల్లో నటిస్తూనే దక్షిణాది చిత్రాలపై ఆసక్తి చూపుతున్నరన్నదితెలిసిందే… వివాదాలకు కేర్ ఆఫ్ గా మారిన ఈమె ఇంతకుముందు తమిళనాడు దివంగత జయలలిత, జీవిత చరిత్రతో రూపొందిన ”తలైవి” చిత్రంలో టైటిల్ పాత్రను పోషించారు.. ప్రస్తుతం పి. వాసు దర్శకత్వంలో వస్తున్న “చంద్రముఖి 2” చిత్రం షూటింగ్ ను కూడా ఆమె పూర్తి చేసుకున్నారు. నిర్మాణాత్మక కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రావడానికి ముస్తాబవుతోంది.. ఇందులో లారెన్స్ కథానాయకుడుగా నటించారు..

అలాగే మరో తమిళ చిత్రంలో నటించడానికి ‘కంగానా’ రెడీ అవుతున్నట్లు తాజా సమాచారం.. ట్రై డెంట్ ఆర్ట్స్, అహింసా ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో ఒక తమిళ నటుడు, హిందీ నటి కలసి నటించబోతున్నట్లు ఇంతకుముందే వారు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.. తాజాగా ఈ క్రేజీ చిత్రంలో “విజయ్ సేతుపతి” కథానాయకుడుగా నటించనున్నారు. ఆయనతోపాటు కంగాన నటించనున్నట్లు కోలీవుడ్ సమాచారం…

దీనికి మలయాళ టాప్ డైరెక్టర్ అయినటువంటి “విపిన్” ఈ మూవీని తెరకెక్కించనున్నారు.. “థ్రిల్లర్” కథాంశంతో రూపొందించనున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.. ఈ ‘రేర్’ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్రంపై ఇప్పటినుంచే ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా నటి ‘కంగానా రనౌత్’ స్వీయ దర్శకత్వంలో నటించి నిర్మిస్తున్న హిందీ చిత్రం “ఎమర్జెన్సీ” త్వరలో తెరపైకి రావడానికి, సిద్ధమవుతోందన్నది గమనార్హం…….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page