“నాగ చైతన్య” తో జతకట్టనున్న “కీర్తి సురేష్”…

“కస్టడీ” సినిమాతో నిరాశపరిచిన “నాగచైతన్య” తన నెక్స్ట్ మూవీను, చందు మొండేటి డైరెక్షన్లో గీత ఆర్ట్స్ నిర్మాణంలో తండేల్ ( వర్కింగ్ టైటిల్ ) అనే సినిమాను చేస్తున్నాడు….ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజిలో ఉన్న ఈ ప్రాజెక్టును అల్లు అరవింద్ దాదాపు 50 కోట్ల బడ్జెట్తో నిర్మించబోతున్నారు…. ఇప్పటికే కథ పూర్తయింది. కార్తీక్ అనే రైటర్ అందించిన ఈ కథతో సినిమా తెరకెక్క నుంది…

ప్రస్తుతం ‘చందు మొండేటి ‘మిగతా కాస్టింగ్ను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు… చైతు కు జంటగా ‘కీర్తి సురేష్’ ను హీరోయిన్ గా అనుకుంటున్నారు… “దసరా” సినిమా లోనీ ‘వెన్నెల’ పాత్రను ఈ మూవీలో పాత్ర పోలి ఉండటంతో ఈ సినిమాకు పర్ఫెక్ట్ అని!! అలాగే ‘చైతు’కి కూడా కొత్త కాంబినేషన్ గా ఉంటుందని భావిస్తున్నారట… డేట్స్ అడ్జస్ట్ అయితే కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసుకోవడం ఖాయం…

ఈ సినిమాకు సంగీత దర్శకునిగా ‘అనిరుద్’ ను తీసుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు.. ‘అనిరుద్’ ఫిక్స్ అయితే బడ్జెట్ మరో 10 కోట్లు పెరగనుంది… ‘అనిరుద్’ కాకుంటే “రెహ్మాన్” లాంటి అగ్ర సంగీత దర్శకుల వైపు చూస్తున్నారు.. శ్రీకాకుళంలో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్ ‘ఫ్రిక్షనల్ యాక్షన్ డ్రామా’గా! ఈ సినిమా తెరకక్క నుందని ఇన్సైడ్ టాక్…

ఇక ఈ సినిమాలో. శ్రీకాకుళం నుండి గుజరాత్ వలస వెళ్లిన మత్స్య కారుడిగా చైతు కనిపించనున్నాడు. ప్రస్తుతం “చై” తన లుక్ పై శ్రద్ధ తీసుకుంటూ వర్క్అవుట్ చేస్తున్నాడు.. ఇప్పటివరకు ‘చైతు’ని చూడని విధంగా ప్రజెంట్ చేసేందుకు చందు మొండేటి ప్రయత్నిస్తున్నాడు. “కార్తికేయ 2” తర్వాత చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి… ఈ మూవీ “చైతు”కి బిగ్గెస్ట్ హిట్ ను ఇస్తుందని అక్కినేని ఫ్యాన్స్ భావిస్తున్నారు …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page