“ఎవ్వరిని వదలను” రానా, త్రివిక్రమ్ పై గుణశేఖర్ షాకింగ్ కామెంట్స్… అసలు కథ ఏంటో తెలుసా!

రానా దగ్గుబాటి తాను పౌరాణిక వ్యక్తిపై సినిమా తీస్తున్నట్లు ప్రకటించాడు. మరియు స్క్రిప్ రైటర్ గా ప్రతిభావంతుడైన త్రివిక్రమ్ తో SDCC 23 కాన్సెప్ట్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది. అయితే ఈ సినిమా గురించి ప్రస్తుతం ఆన్లైన్లో విపరీతంగా చర్చ జరుగుతుంది….. గుణశేఖర్ ట్విట్ పరోక్షంగా రానా దగ్గుబాటి నీ ఉద్దేశించి అని సూచిస్తుంది…. దేవుడిని మీ కథకు ఇతివృత్తంగా చేస్తున్నప్పుడు, దేవుడు మీ సమర్థత ను గమనిస్తున్నాడని మీరు గుర్తించుకోవాలి అనైతిక చర్యలకు నైతిక మార్గాల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది అని గుణశేఖర్ ట్విట్ లో రాశారు. హిరణ్యకశ్యప గుణశేఖర్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో చాలామంది గుణశేఖర్ కు మద్దతు తెలిపారు….. వీటన్నిటి మధ్య రానా సైలెంట్ గా ఉన్నాడు. రియాక్షన్ గురించి ఆసక్తిగా నెటిజన్లు ఎదురుచూస్తున్నారు .

అయితే అసలు ఏంటి కన్ఫ్యూషన్ తెలుసుకోవాలంటే కొన్ని నెలల ముందర జరిగిన కథను మనం చెప్పుకోవాలి…..

ఇక్కడ ముందుగా మనం గుణశేఖర్ గురించి చెప్పుకోవాలి. ఈయన సీనియర్ డైరెక్టర్స్ లో ఒకరు…. నేషనల్ అవార్డు విన్నర్ “ఒక్కడు ” మూవీవంటి ఇండస్ట్రీ హిట్స్ కూడా చూశారు. ఆచి తూచి సినిమాలు చేసే గుణశేఖర్, 30 ఏళ్ల కెరీర్లో చేసిన సినిమాలు తక్కువే…. గుణశేఖర్ అంటే భారీ సెట్స్ కి ఫేమస్.. ‘ఒక్కడు’లో “చార్మినార్ సెట్” అర్జున్ మూవీలో ‘మధుర మీనాక్షి టెంపుల్ సెట్’ గురించి జనాలు గొప్పగా చెప్పుకున్నారు.

మరి మన దర్శకుడు గుణశేఖర్ హిరణ్య కశ్యప కోసం ఏళ్ల తరబడి పని చేశారు. ప్రాజెక్ట్ ఆలస్యం అయ్యేలా ఉండటంతో “శాకుంతలం” మూవీ స్టార్ట్ చేశారు.’శాకుంతలం’ రిజల్ట్ ఇండస్ట్రీలో పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘శాకుంతలం’ చిత్రాన్ని సీరియల్ గా అభివర్ణించారు, అంతేకాక దిల్ రాజు ఇది నాకు భారీ దెబ్బ అని ఓపెన్ గా ఇంటర్వ్యూలో చెప్పారు….. ఈ సినిమా సాయంత్రానికి థియేటర్స్ నుండి ఎత్తేసే పరిస్థితి అని, రూ.60-70 కోట్లు ఖర్చు చేసి తీస్తే 10 కోట్ల షేర్ కూడా రాలేదు అని వాపోయారు….. అంతేకాక ఈ “శాకుంతలం” మూవీ సమంత కెరీర్లో ఎపిక్ డిజాస్టర్ గా నిలిచింది…..

పూర్వ వైభవం గుణశేఖర్ కు లేదు. ఆయన కమర్షియల్ హిట్ ఇచ్చి చాలా కాలం అవుతుంది… “రుద్రమదేవి” హిట్ అంటారు కానీ! ప్రేక్షకుల మది లో గట్టి ముద్ర వేయలేకపోయింది….. “రుద్రమదేవి” మూవీ క్లీన్ హిట్ అయితే గుణశేఖర్ కి స్టార్స్ ఆఫర్స్ ఇచ్చేవారు… ఇక “శకుంతల” మూవీతో ఉన్న కొద్దో గొప్పో ఇమేజ్ కూడా పోగొట్టుకున్నారు….. గుణశేఖర్ పని అయిపోయిందని జనాలు ఫిక్స్ అయ్యారు…..

ఇక గుణశేఖర్ ని నమ్మి ఎవరైనా సినిమాలు ఇస్తారా అంటే కష్టమే.. అయితే గుణశేఖర్ ‘2019’లోనే ఒక భారీ ప్రాజెక్టు ప్రకటించారు. దాని పేరే “హిరణ్యకశ్యప” ‘రానా దగ్గుబాటి ‘హీరోగా పౌరాణిక గాధ రూపొందనుందని ప్రకటించారు. ఏళ్ల తరబడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేశారు. “హిరణ్య కశ్యప” గుణశేఖర్ డ్రీం ప్రాజెక్ట్ కాగా కొంత ఖర్చు చేసి ఆ ప్రాజెక్టు మీద వర్క్ చేశారు…. కానీ తదనంతరం జరిగిన సంఘటనలు కారణంగా హీరో ‘రానా దగ్గుబాటి’ “హిరణ్యకశప” టైటిల్ తో భారీ పౌరాణిక చిత్రం ప్రకటించడంతో!! ఇప్పటివరకు శ్రమించిన దర్శకుడు గుణశేఖర్ గుండెల్లో మంట రేపినట్లు అయ్యింది….

దీంతో ఆయన పరోక్షంగా “రానా” నైతికతను ట్విట్ ద్వారా ప్రశ్నించారు.. ఇక్కడ గుణశేఖర్ ఎవరి పేరు ప్రస్తావించలేదు అయినప్పటికీ ఆయన ‘రానా’ ‘త్రివిక్రమ్’ లను టార్గెట్ చేశారని తెలుస్తోంది.. తన శ్రమను మరచి ప్రాజెక్టు వేరే వాళ్ళ చేతిలో పెట్టిన ‘రానా’ ను ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అయిన త్రివిక్రమ్ లకు నీతి లేదని ఆయన భావన…అని నెటిజన్స్ అభిప్రాయంగా తెలుస్తోంది….

అయితే గుణశేఖర్ ట్విట్ క్రింద అభిమానులు ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.. అది మీ డ్రీమ్ ప్రాజెక్ట్….. అని రానా ,త్రీ విక్రమ్ లు సిగ్గుపడాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు… మొత్తంగా “హిరణ్యకశ్యప” ప్రాజెక్ట్ ఓకింత ఇంట్రెస్టింగా! వివాదాస్పదం గా! అవుతుందని అనిపిస్తోంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page