➤ తల్లికి వందనం 13 వేలు జమ.. 2 వేలు అభివృద్ధి పనుల కోసం మినహాయింపు
▪️తల్లికి వందనం పథకం విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.13 వేల నగదు జమ.
▪️ప్రతి విద్యార్థి నుంచి రూ.2 వేల మినహాయింపు.
▪️స్కూళ్లు, కాలేజీల అభివృద్ధి పనుల కోసం... మినహాయించిన నిధులను వినియోగించనున్న ప్రభుత్వం.
▪️కలెక్టర్ ఆధ్వర్యంలోని ఖాతాలో జమ చేస్తున్న ప్రభుత్వం , 16 వ తేదీ లోపు అందరికి పూర్తి
▪️ ఏమైనా పిర్యాదులు ఉంటె వాట్సాప్ లేదా సచివాలయం లో సంప్రదించవచ్చు.
తల్లికి వందనం 2025 షెడ్యూల్ :
✓ జూన్ 16 - 20 : అర్జీల పెట్టుకోవడానికి అవకాశం
✓ జూన్ 21 - 28 : అర్జీల వెరిఫివేషన్
✓ జూన్ 30 : 1వ తరగతి, ఇంటర్ అర్హుల జాబిత ప్రదర్శన
✓ జులై 5 : అర్జీల వెరిఫికేషన్ లో అర్హులైన వారికి + మిగిలిపోయిన అర్హులకు నగదు జమ
ముఖ్య గమనిక: అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతి కి వెళ్ళే పిల్లలు, మరియు 10 వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్ లో చేరే పిల్లలు పేర్లు,ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26తారీకు వరక వీరి నమోదు ప్రక్రియ జరిగి, 30 వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ల పేర్లు వస్తాయి. వీళ్ళకి July 5 తర్వాత అమౌంట్ జమ అవుతాయి. ఈ సంవత్సరం ఇంటర్ 2nd year పూర్తి అయిన విద్యార్థులకు మాత్రం తల్లికి వందనం పథకం వర్తించదు. ఎందుకంటే వాళ్లు విద్య దీవేన పథకం కిందకి వస్తారు.
Thalliki Vandanam Application Status 2025 New
మీ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి మీ తల్లికి వందనం పేమెంట్ స్టేటస్ చెక్ చేయండి
Thalliki Vandanam Guidelines New
Thalliki Vandanam Mother Death verification & ekyc module user manual New
Talliki Vandanam Scheme 2025: ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి జగనన్న అమ్మ ఒడి పథకాన్ని ప్రస్తుతం తల్లికి వందనంగా సవరించిన ప్రభుత్వం ఇందుకు సంబంధించినటువంటి ముఖ్యమైన జీవో ను విడుదల చేసింది. గత ప్రభుత్వం ఇంట్లో ఒక విద్యార్థికి మాత్రమే 15000 చెల్లిస్తుండగా, ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం కింద ఎంతమంది విద్యార్థులు ఉంటే అంత మందికి 15000 చెల్లించడం జరుగుతుంది.ప్రస్తుతం ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం "తల్లికి వందనం" పథకం పేరిట దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న క్లాసులు I నుండి XII వరకు చదివే విద్యార్థులను పాఠశాలలు/కళాశాలలకు పంపడానికి తల్లి లేదా గుర్తింపు పొందిన సంరక్షకుడికి సంవత్సరానికి రూ.15,000/- ఆర్థిక సహాయం అందిస్తుంది.
➤ గ్రామీణ ప్రాంతాలు నెలకు రూ. 10000/- లోపు పట్టణ ప్రాంతాలు నెలకు రూ. 12000/-ల లోపు ఉండాలి.
➤ 3 ఏకరాలు కంటే తక్కువ మాగాణి లేదా 10 ఏకరాలు కంటే తక్కువ మెట్ట లేదా రెండూ కలిపి గరిష్ఠంగా 10 ఏకరాలు లోపు ఉన్న కుటుంబంలోని వారు మాత్రమే అర్హులు
➤ తల్లి లేదా లబ్ధిదారు తెల్ల రేషన్ కార్డు మరియు ప్రభుత్వం జారీ చేసిన చెల్లుబాటయ్యే ఆధార్ కార్డు కలిగి ఉండాలి.
➤ కుటుంబంలోని ఏ వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగి లేదా ఫించనుదారు అయి ఉండరాదు. ఈ షరతు నుండి పారిశుద్ధ్య పనివారి కుటుంబాలు మినహాయింపు ఉంటుంది.
➤ లబ్దిదారు కుటుంబం నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్రాక్టర్, టాక్సీ, ఆటోలు ఈ షరతు నుండి మినహాయించబడినవి).
➤ గడచిన 12 నెలలలో కుటుంబం యొక్క విద్యుత్తు వినియోగం నెలకు పదాసరి 300 యూనిట్లు మించరాదు.
➤ ఆదాయపు పన్ను చెల్లిస్తున్నవారు ఈ పథకానికి అనర్హులు.
➤ మున్సిపాలిటీ పరిధిలో 1000 చ.అ ల కంటే తక్కువ స్థలం ఉన్నవారు అర్హులు. (పట్టణ ప్రాంతాలకు మాత్రమే వర్తిస్తుంది).
➤ వయస్సు & లింగం షరతు వర్తించదు.
➤ పుట్టిన తేదీ ధ్రువీకరణ కోసం ఆధార్ కార్డు / సమీకృత ధృవీకరణ పత్రం ఉండాలి
➤ తల్లి/ లబ్దిదారు యొక్క గుర్తించబడిన గార్డియన్ యొక్క బ్యాంకు ఖాతా, ఆధార్ తో అనుసంధానించబడి ఉపయోగంలో ఉండి ఉండాలి.
➤ విద్యార్థులు 75% హాజరు ఉండేలా చూసుకోవాలి.
Note : అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత అర్హత ప్రమాణాలు మారే అవకాశం ఉంటుంది.
ఒకటి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు తల్లికి వందనం కింద అమౌంట్ పొందాలంటే తప్పనిసరిగా వారికి ఆధార్ ఉండాలి.
ఆధార్ కార్డ్ ఒకవేళ విద్యార్థి పేరుతో లేకపోతే వెంటనే దరఖాస్తు చేసి దరఖాస్తు చేసినటువంటి ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తో పాటు కింద ఇవ్వబడిన ఏదో ఒక ప్రూఫ్ ని జత చేయాల్సి ఉంటుంది.
బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ పాస్ బుక్, పాన్ కార్డ్, పాస్పోర్ట్, రేషన్ కార్డ్, మేజర్ అయితే ఓటర్ కార్డ్, nrega కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా వ్యక్తిని గుర్తిస్తూ ఎవరైనా గెజిటెడ్ ఆఫీసర్ లేదా తాహసిల్దార్ జారీ చేసిన దృవ పత్రం అయినా ఉండాలి.
ప్రస్తుతం ఆధార్ కార్డు ఎన్రోల్ చేస్తుంటే నెలలోపే వస్తుంది కాబట్టి ఇప్పటినుంచే లబ్ధిదారులు ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎక్కువ శాతం మంది మైనర్ పిల్లలే ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ పిల్లలకు ఆధార్ కార్డుకి అప్లై చేయాల్సి ఉంటుంది.
గత ప్రభుత్వం మాదిరి గానే ప్రస్తుత ప్రభుత్వం కూడా ఒకటి నుంచి 12వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు ఈ పథకం కింద నగదు పొందాలంటే తప్పనిసరిగా 75% హాజరు ఉండాలని నిబంధన ను కొనసాగించడం జరిగింది.
పైన పేర్కొన్నటువంటి అర్హతలను తల్లికి వందనం పథకం తో పాటు విద్యా కానుక స్టూడెంట్ కిట్స్ పథకానికి కూడా అమలు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
Q1.While raising a grievance, should it be done using the Mother’s Aadhaar or the Student’s Aadhaar?
Ans : Grievance should be raised only in the name of the Mother/Guardian, using her Aadhaar number.
Q2.Names of students studying in Kendriya Vidyalayas are not appearing. Are they eligible?
Ans : The School Education Department will take a decision regarding the eligibility of such students.
Q3.If a mother has 2 or 3 children and only one received the amount, what should be done?
We don't know who received the amount. How to raise the grievance?
Ans : Data has been processed based on the information received from the School Education Department, excluding 10th and 12th pass-out students. Grievance should be raised in the name of the mother, even if you are unsure which child received the amount.
Q4.In re-surveyed villages, due to joint LPM entries, some eligible people are marked as ineligible. What is the solution?
Ans : This issue is under review at the Government level. Further instructions will be shared once a decision is made.