రైతు భరోసా

#

రైతు భరోసా



తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది రోజుల్లో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రజలను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపించింది. హైదరాబాద్ తుక్కుగూడలో ఆదివారం నిర్వహించిన విజయభేరి సభలో 6 గ్యారంటీ స్కీమ్ లను ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని అమలు చేస్తామని చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రైతు భరోసా ద్వారా రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15 వేల పంట పెట్టుబడి సాయం. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేల సాయం. వరి పంటకు ప్రతి క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించారు

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #