నేటి నుంచి రైతు భరోసా కేంద్రాల ద్వారా మొక్కజొన్న కొనుగోలు చేయనున్నట్లు మార్కు ఫేడ్ ఎండి రాహుల్ పాండే వెల్లడి.
Update 2: రైతు భరోసా కేంద్రాలలో త్వరలో 7,384 సహాయకులు పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి తెలిపారు.
MSP(కనీస మద్దతు ధర) పూర్తి లిస్ట్ కొరకు క్లిక్ చేయండిClick here to downloadNew
రైతు భరోసా కేంద్రాల్లో వాలంటీర్ల సేవలకు సంబంధించిన అప్డేట్స్ కోసం RBK Volunteer Updates
YSR Yantra Seva Scheme Updates New
RBK ల పరిధిలో వైస్సార్ యంత్ర సేవ పథకం అప్డేట్స్
ఏపీలో అన్నదాతల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ఏకకాలంలో 10.641 కేంద్రాలు ప్రారంభమయ్యాయి. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ను కూడా లాంఛ్ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇక భరోసా కేంద్రాల నుంచే వ్యవసాయ సేవలు అందిస్తారు.. శిక్షణ తరగతులు, విజ్ఞాన కేంద్రాలుగా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తాయి. అంతేకాదు విత్తనాలు, ఎరువులు, పురుగుమందులకు ప్రభుత్వమే గ్యారెంటీ ఉంటుంది. అంతేకాదు కాల్సెంటర్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందిస్తారు.. ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్ నెంబర్ 155251. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంబంధిత అధికారులు ప్రారంభించనున్న భరోసా కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ భరోసా కేంద్రం అమలు ద్వారా రైతులు వ్యవసాయ రంగంలోని నిపుణుల సహకారంతో సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. ఈ నిపుణులు రైతు భరోసా కేంద్రాలలో కూర్చొని రైతులందరికీ వారి వ్యవసాయ కార్యకలాపాలలో సహాయం చేస్తారు, దీని ఫలితంగా పెద్ద ఉత్పత్తి మరియు గడ్డిబీడులందరికీ పెద్ద లాభం కూడా ఉంటుంది
ఏపీలో రైతులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఇకపై రైతు భరోసా కేంద్రాల ద్వారానే ధాన్యం సేకరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ-క్రాప్, కేవైసీ డేటా ఆధారంగా ధాన్యం సేకరించనుంది. మంత్రివర్గ ఉప సంఘం సిఫార్సులతో డీసెంట్రలైజ్డ్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ పాలసీపై గెజిట్ విడుదల చేశారు. 2021-22 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో ధాన్యం సేకరణకు కేంద్రీకృత విధానాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్బీకేల్లో కనీస మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం సేకరించాలని భావిస్తున్నారు. పౌర సరఫరాల సంస్థతో పాటు మార్క్ఫెడ్ను కూడా భాగస్వామిని చేశారు. గ్రేడ్ ‘ఏ‘ రకం ధాన్యాన్ని క్వింటాల్ రూ.1,960, సాధారణ రకం క్వింటాల్ రూ.1,940లకు కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో 39.35 లక్షల ఎకరాల్లో వరి సాగవగా కనీసం 80 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ఇందులో 50 లక్షల టన్నుల ధాన్యాన్ని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు సేకరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఈ–క్రాప్తో పాటు రైతుల ఈకేవైసీ (వేలిముద్రలు) ప్రామాణికం. వరి సాగవుతున్న ప్రాంతాల్లో 6,884 ఆర్బీకేల్లో సేకరణ కేంద్రాలు ఉంటాయి. ధాన్యం సేకరణ, మిల్లింగ్, పంపిణీకి సంబంధించి ఏపీ మార్క్ఫెడ్, పౌరసరఫరాల సంస్థకు బాధ్యతలు. గతంలో మాదిరిగా ప్రత్యేక పోర్టల్లో రైతులు వివరాలను నమోదు చేసుకోనవసరం లేదు. ఆర్బీకేల్లో ఉండే టెక్నికల్ సిబ్బంది కూపన్ ద్వారా ఎప్పుడు తీసుకురావాలో తెలియజేస్తారు. ధాన్యం తేమ శాతం 17 శాతానికి మించి ఉండకూడదు. రైతులు విక్రయించిన ధాన్యం, వాటి విలువ వివరాలతో రసీదు తీసుకోవాలి. రైతులకు 21 రోజుల్లో వారి ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేస్తారు. ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లలో అమ్మదలచిన రైతులు సైతం తమ పంట వివరాలను ఆర్బీకేలో తప్పనిసరిగా నమోదు చేయాలి. ఆర్బీకేల్లో సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ సామర్థ్యం ప్రకారం కస్టమ్ మిల్లింగ్, సీఎంఆర్ డెలివరీ కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తారు. ఇందుకోసం 1:1 నిష్పత్తిలో బ్యాంకు గ్యారెంటీ సమర్పించి రైసుమిల్లులు సంబంధిత ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీతో ఎంవోయూ పొందుతారు. కస్టమ్ మిల్లింగ్ చేయడం, నిర్ణీత గడువులోగా బట్వాడా చేయడంలో కానీ విఫలమైన రైస్ మిల్లర్లను బ్లాక్లిస్ట్ పెట్టడంతో పాటు తీవ్రతను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. ఈ మేరకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.