Ration Card services
Updates
Update 1 :రానున్న 2 నెలల్లో రాష్ట్రమంతా కావల్సిన వారికి రేషన్ కార్డు పై బియ్యానికి బదులు రాగులు , జొన్నలు , గోధుమపిండిని..కిలో రూ.16కే అందించనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి తెలిపారు. ఇప్పటికే పైలోట్ ప్రాజెక్ట్ పూర్తి .
రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఈ ఏడాది మొత్తం బియ్యం ఉచితం. ప్రస్తుతం ఇస్తున్న రూపాయి చెలించాల్సిన అవసరం లేదు.
update
HELPLINE NUMBER
States Covered : Andhra Pradesh
Any grievance number : 1902
◼️
రైస్ కార్డు అర్హత ప్రమాణాలు
▪️ మొత్తం వ్యవసాయ భూమి ఒక వేళ తడి భూమి అయితే 3 ఎకరాల లోపు పొడి భూమి అయితే పది ఎకరాల లోపు తడి పొడి మొత్తం కలిపి పది ఎకరాల లోపు ఉండాలి!
▪️మీరు ప్రభుత్వ ఉద్యోగి కానీ రిటైర్ అయి పెన్షన్ తీసుకున్నటువంటి ఉద్యోగి కానీ అయి ఉండకూడదు
▪️ మీరు ఫోర్ వీలర్ కలిగి ఉండకూడదు. అయితే టాక్సీ ట్రాక్టర్ మరియు ఆటో కలిగిన వారికి మినహాయింపు ఉంది.
▪️ నెలవారీ విద్యుత్ వినియోగం 300 యూనిట్లు మించకూడదు
▪️ మీకు మున్సిపల్ ఏరియా లో వెయ్యి చదరపు అడుగులకు మించి నిర్మాణం ఉండరాదు
▪️ మీరు కానీ మీ కుటుంబ సభ్యులలో ఎవరో కానీ ఇన్కమ్ టాక్స్ చెల్లింపుదారులు అయి ఉండరాదు.
◼️ న్యూ రైస్ కార్డ్ లేదా బియ్యం కార్డ్ అప్లికేషన్ ప్రాసెస్
▪️నూతన విధానం ప్రకారం ఇప్పుడు అప్లై చేసిన పది రోజులలో మీకు రైస్ కార్డు మంజూరు కావాల్సి ఉంటుంది.
▪️మీరు అప్లై చేయుటకు మీ కుటుంబ సభ్యులందరి ఆధార్ కాఫీతో పాటు లిఖిత పూర్వకమైన అప్లికేషన్ను వాలంటీర్ కి ఇవ్వాల్సి ఉంటుంది.
ఏవిధంగా new rice card 10 రోజులలో ప్రాసెస్ చేస్తారు
ఐదు రోజుల నుండి పది రోజులకు ప్రభుత్వం ఈ గడువును పొడిగించారు.
దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. దీని యొక్క పిడిఎఫ్ ఫైల్ మీరు ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Note: రేషన్ కార్డ్ మరియు రైస్ కార్డ్ సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీరు ఈ పేజ్ ద్వారా తెలుసుకోవచ్చు!