
➠ Vahana Mitra to be launched today : నేడే వైఎస్సార్ వాహన మిత్ర నాలుగో విడత ప్రారంభం.
➠ నేడు రాష్ట్ర వ్యాప్తంగా 2,61,516 మంది ఆటో, టాక్సీ, మ్యాక్సి క్యాబ్ డ్రైవర్లకు పదివేల రూపాయల చొప్పున 261.51 కోట్లను లబ్ధిదారుల ఖాతాలో నేరుగా జమ చేయనున్న ముఖ్యమంత్రి.
➠ వైయస్సార్ వాహన మిత్ర స్టేటస్ కింది లింక్స్ ద్వారా చెక్ చేయండి.
Vahana Mitra Status 2022- ఆధార్ తో వాహన మిత్ర స్టేటస్ చెక్ చేయండి Status Link
[Select Aadhar ID - పై లింక్ లో type దగ్గర Aadhar ID అని ఎంచుకోండి ]
వాహన మిత్ర స్టేటస్ చెక్ చేయండి
వైయస్సార్ వాహన మిత్ర పథకం అన్ని ద్వారా రాష్ట్రంలో ఆటో , ట్యాక్సీ లేదా మాక్సి క్యాబ్ నడిపే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ పథకాన్ని 2019లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.36 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.
1. లబ్ధిదారుడు సొంతంగా ఆటో రిక్షా లేదా టాక్సీ లేదా టాక్సీ క్యాబ్ కలిగి ఉండాలి.
2. లబ్ధిదారులు సరైన డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
3. లబ్ధిదారుడు నడుపుతున్న వాహనానికి సరైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ RC పొంది ఉండాలి.
4. ప్రతి ఒక్క దరఖాస్తు దారునికి సరైన ఆధార్ కార్డ్ కలిగి ఉండాలి.
5. లబ్ధిదారుడు బిపిఎల్ లేదా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
6. ఒక కుటుంబానికి ఒక వాహనానికి మాత్రమే అమౌంట్ జమ చేయబడును.
7. కుటుంబం అనగా భర్త భార్య మరియు మైనర్ పిల్లలను ఒక కుటుంబం గా పరిగణిస్తారు.
8. వాహనం యొక్క ఓనర్ షిప్ మరియు లైసెన్స్ రైస్ కార్డు లో ఉన్నటువంటి ఎవరి పేరు మీద అయినా ఉండవచ్చు.
9. ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలు కలిగిన వారు వెంటనే తమ అడ్రస్ మార్చుకోవాలి
10. అప్లై చేసే వ్యక్తి పేరు మీద వాహనం కలిగి ఉండాలి మరియు సరైన బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి.
జూన్ నెలలో వాలంటీర్స్ ద్వారా అప్లికేషన్ తీసుకొని సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.. ఆ విధంగా స్వీకరించిన అప్లికేషన్స్ ఆరు దశల్లో ధ్రువీకరణ పాస్ అయితే అర్హులైన వారికి ప్రభుత్వం పది వేల రూపాయల నగదు జూలై లో జమ చేస్తుంది.
.Note: వైయస్సార్ వాహన మిత్ర యాప్ దారుల ఇన్ఫర్మేషన్ కోసం ప్రత్యేక వెబ్ పేజ్ ఇది. ఈ ఏడాది మూడో విడత వైఎస్ఆర్ వాహనమిత్ర కొత్తగా అప్లై చేస్తున్న వారు, జూన్ నెలలో అప్లికేషన్ ప్రారంభం అయిన తర్వాత పైన తెలిపిన విధంగా వాలంటీర్ ద్వారా అప్లై చేయవచ్చు లేదంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.



