➤ PM Vidya Lakshmi Scheme 2025: Apply for Education Loans Online
ఉన్నత విద్య చదవాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ, కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించక చాలా మంది ఆ కోరిక తీరకుండానే విద్యాభ్యాసం ముగిస్తారు. తమ కల నెరవేరకుండానే, జీవితం కోసం రాజీ పడతారు. ఏదో చిన్నా, చితకా ఉద్యోగంలో చేరిపోతారు. ఉద్యోగం రానివాళ్లు ఏదో ఒక కంపెనీలో కార్మికుడిగా చేరిపోతారు. లేకపోతే, వ్యవసాయంలో కుటుంబానికి సాయంగా నిలుస్తారు. పెద్ద చదువులు చదివి జీవితంలో ఉన్నతంగా సెటిల్ అయ్యే అవకాశం ఉన్నా.. పరిస్థితులు అనుకూలించక రాజీపడి అక్కడే ఆగిపోతారు. అలాంటి వారికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం (PM Vidya Lakshmi Scheme) ప్రారంభించింది. విద్యార్థి పైచదువులకు సంబంధించిన డబ్బును ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ పథకం ద్వారా ఉన్నత విద్య కోసం రుణం పొందడమే కాదు.. కొన్నిసార్లు ప్రభుత్వం మీకు వడ్డీని కూడా మాఫీ చేస్తుంది.
దేశంలోని ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విద్యా లక్ష్మి’ పథకాన్ని ప్రారంభించింది. 2024 కేంద్ర బడ్జెట్లో ఈ పథకాన్ని ప్రకటించారు. 2024 నవంబర్ 6న ప్రధానమంత్రి విద్యా లక్ష్మి యోజన పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఉన్నత చదువుల కోసం ఒక విద్యార్థికి ఈ పథకం కింద రూ.15-16 లక్షల వరకు రుణం ఇస్తారు. రూ. 10 లక్షల వరకు రుణం తీసుకుంటే కేవలం 3 శాతం మాత్రమే వడ్డీ చెల్లించాలి. కొన్నిసార్లు ఈ రుణంపై ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుంది. రుణం తీర్చడానికి 15 సంవత్సరాల సమయం ఉంటుంది. కోర్సు పూర్తయిన తర్వాత ఏడాది వరకు కూడా వడ్డీలో మినహాయింపు కల్పిస్తారు.
చాలా మంది తెలివైన విద్యార్థులు ఆర్థిక సమస్యల వల్ల చదువును మధ్యలోనే ఆపేస్తారు. అలాంటి విద్యార్థులకు పీఎం విద్యాలక్ష్మీ పథకం ఒక మంచి అవకాశం. ఒక్క మాటలో చెప్పాలంటే, జీవితాన్ని మలుపు తిప్పే ఛాన్స్.
★ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువును మధ్యలో ఆపకూడదు.
★ ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండాలి.
పీఎం విద్యా లక్ష్మి పథకం అధికారిక వెబ్సైట్:
విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం ఆధారంగా వడ్డీలో రాయితీ ఉంటుంది.
విద్యార్థి కుటుంబ వార్షికాదాయం | టెక్నికల్/ ప్రొఫెషనల్ కోర్సులకు | ఇతర కోర్సులకు |
రూ. 4.5 లక్షల వరకు | 100% వడ్డీ మాఫీ (PM-USP CSIS పథకం కింద) | 3% రాయితీ |
రూ. 4.5 లక్షల నుంచి 8 లక్షలు | 3% Interest Subvention | 3% Interest Subvention |
ప్రధానమంత్రి విద్యా లక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఈ కింది దశలను అనుసరించండి:
✧ ముందుగా పీఎం విద్యా లక్ష్మి పోర్టల్లో నమోదు చేసుకోవాలి.
✧ దీని కోసం అధికారిక పోర్టల్కు వెళ్లండి.
✧ "Student Login"పై క్లిక్ చేసి, ఆపై "Create An Account"పై క్లిక్ చేయండి.
✧ ఇప్పుడు Student Registration Form ఓపెన్ అవుతుంది.
✧ అందులో మీ పేరు, మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడీ లాంటి వివరాలు నమోదు చేయండి.
✧ ఆ తర్వాత Generate OTP పై క్లిక్ చేయండి. మీ మొబైల్ నంబర్కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి, వెరిఫై చేయండి.
✧ పాస్వర్డ్ను ఎంటర్ చేసి, మళ్లీ కన్ఫర్మ్ చేయండి.
✧ క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి.
✧ అధికారిక పోర్టల్లో User ID మరియు Passwordతో లాగిన్ అవ్వండి.
✧ మీ ఇ-మెయిల్ ఐడీ మీ యూజర్ ఐీ అవుతుంది. OTPతో వెరిఫై చేయండి.
✧ Student Homepageలో "Apply for Education Loan"పై క్లిక్ చేయండి.
✧ అప్లికేషన్ ఫామ్లో అడిగిన మొత్తం సమాచారాన్ని పూరించండి.
✧ అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
✧ ఏ బ్యాంకు నుంచి రుణం కావాలో ఆ వివరాలను పూరించండి.
✧ వివరాలను చెక్ చేసుకొని సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి.
✦ అధికారిక పోర్టల్లో మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి.
✦ "Track Loan Application"పై క్లిక్ చేయండి.
✦ లిస్ట్ నుంచి మీ లోన్ అప్లికేషన్ నంబర్ను ఎంచుకోండి.
✦ మీ లోన్ స్టేటస్ (Under Review/ Approved/ Processed) తెలుస్తుంది.
మీకు ఏదైనా సమస్య ఉంటే, అధికారిక పోర్టల్లో "Initiate Grievance" సెక్షన్కు వెళ్లండి.
✧ "Register New Complaint"పై క్లిక్ చేయండి.
✧ మీ లోన్ అప్లికేషన్ నంబర్ను ఎంచుకోండి, ఫిర్యాదు రకాన్ని కూడా ఎంచుకోండి.
✧ ఏ బ్యాంకు నుంచి రుణం పొందారో ఆ బ్యాంక్ పేరు, వివరాలను నింపండి.
✧ మీ ఫిర్యాదు గురించి వివరంగా తెలపండి.
✧ సంబంధిత డాక్యుమెంట్లను కూడా అప్లోడ్ చేయండి.
✧ మీకు ఒక యూనిక్ ఐడీ వస్తుంది.
ఈ ఐడీ ద్వారా మీ కంప్లైంట్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. సాధారణంగా ఫిర్యాదు చేసిన వారం నుంచి రెండు నెలల (సమస్యను బట్టి) వరకు మీ సమస్యకు పరిష్కారం లభించవచ్చు.
★ దరఖాస్తు ఫామ్
★ ఆధార్ కార్డ్
★ పాన్ కార్డ్
★ నివాస ధృవీకరణ పత్రం
★ 10వ తరగతి/ 12వ తరగతి మార్కుల జాబితా
★ ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ కార్డ్, ఫీజు వివరాలు
★ ఆదాయ ధృవీకరణ పత్రం
విద్యార్థులకు CBDC వాలెట్/ e-voucher ద్వారా డబ్బు అందుతుంది. అయితే, విద్యార్థి ఒకవేళ 3 నెలల్లోపు ఉపయోగించకపోతే, డబ్బు తిరిగి వెళ్లిపోతుంది. చదువులో విద్యార్థి చూపించే ప్రతిభ ఆధారంగా ప్రతి సంవత్సరం ప్రయోజనం కొనసాగుతుంది.
పీఎం విద్యా లక్ష్మి పథకం కింద రుణం పొందడానికి తప్పుడు సమాచారం ఇస్తే, విద్యార్థి నుంచి సబ్సిడీ మొత్తం తిరిగి తీసుకుంటారు. విద్యార్థి భవిష్యత్తులో ఏ ప్రభుత్వ పథకానికి అర్హుడు కాకుండా నిషేధం విధిస్తారు. కొన్నిసార్లు రుణం ఇచ్చిన బ్యాంకును కూడా బాధ్యులను చేయవచ్చు.
రాష్ట్రాల జనాభా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కోటాను నిర్ణయిస్తుంది. దాని ప్రకారం విద్యార్థులకు వడ్డీ రాయితీ లభిస్తుంది. ఉదాహరణకు, బీహార్లో 10 వేల కంటే ఎక్కువ స్లాట్లు ఉన్నాయి, లక్షద్వీప్లో కేవలం 4 మాత్రమే ఉన్నాయి. పూర్తి జాబితా కోసం Annexure 5 చూడండి..
ఒక రాష్ట్రం నుంచి పీఎం విద్యా లక్ష్మి కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తే ఎంపికలో ప్రాధాన్యతా క్రమం ఇలా ఉంటుంది..
★ NIRF యొక్క టాప్ 100 సంస్థలు (సాధారణ/ డొమైన్ ర్యాంకింగ్)
★ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని టాప్ 200 HEIలు
★ కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని HEIలు
‘దేశంలోని ప్రతి విద్యార్థికి ఉన్నత విద్యను అభ్యసించే అవకాశం ఉండాలి. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఎవరూ చదువును మధ్యలో ఆపకూడదు’ అనేది పీఎం విద్యాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశం. డబ్బు లేదనే కారణంతో ఏ విద్యార్థీ ఉన్నత చదువులు చదవాలనే తన కోరికను చంపుకోవాల్సిన పనిలేదు. ఈ పథకం కింద రుణం తీసుకొని ఉన్నత చదువులు పూర్తిచేసి, తమ కెరీర్కు ఉన్నత బాటలు వేసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్.