➤ Idi Manchi Prabhutvam Program
Idi Manchi Prabhutvam Program in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి చేసిన కొన్ని ముఖ్యమైన హామీలను ప్రజలలోకి తీసుకొని వెళ్లేందుకు గ్రామ వార్డు సచివాలయ స్థాయిలో ఇది మంచి ప్రభుత్వం [ Idi Manchi Prabhutvam Program ] కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ 20 నుండి 26 వరకు ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం [ Idi Manchi Prabhutvam Program ] నిర్వహించనున్నారు. ప్రజా ప్రతినిధుల సమక్షంలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఈ ప్రోగ్రాం ప్రజలలోకి వెళ్తుంది.
రాష్ట్రంలో ఉన్న అందరూ ఎమ్మెల్యేలు ఈ ప్రోగ్రాంకు హాజరు అయ్యే విధముగా మరియు జిల్లా స్థాయి ప్రజా ప్రతినిధులు హాజరు అయ్యే విధముగా మండల / మునిసిపాలిటీ స్పెషల్ ఆఫీసర్లుగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది . జిల్లా స్థాయిలో ముఖ్య ప్రణాళిక అధికారి వారు నోడల్ ఆఫీసర్గా ఈ కార్యక్రమానికి ఉంటారు. గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ ప్రోగ్రాం లో భాగం చేస్తూ వారి పర్యవేక్షణ నిమిత్తం మండల స్థాయిలో ఎంపీడీవో వారిని మునిసిపాలిటీ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ వారిని నియమించడం జరిగినది.
ఈ ప్రోగ్రాం లో ప్రతి ఇంటికి పంచుటకు గాను ప్రభుత్వం నుండి స్టిక్కర్లు మరియు పాంప్లెట్లు ప్రింటింగ్ చేసినవి జిల్లాల నుండి మండల అధికారుల ద్వారా సచివాలయాలకు అందించడం జరుగుతుంది . వాటిని మండల అధికారుల పర్యవేక్షణలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది మరియు సంబంధిత ప్రజా ప్రతినిధుల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయవలసి ఉంటుంది. రోజువారి రిపోర్టులను తయారుచేసుకొని సంబంధిత అధికారులు ఆదేశాల మేరకు వాటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకుగాను సచివాలయ పరిధిలో ఉన్న ఇళ్లను సచివాలయ సిబ్బందితో అనుసంధానం ఇప్పటికే పూర్తి అయినది.
ప్రోగ్రాం జరుగు తేదీ సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 మధ్య సంబంధిత ఎమ్మెల్యే వారు తప్పనిసరిగా ప్రతిరోజు కనీసం ఒక గ్రామ లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించి వారి నియోజకవర్గ పరిధిలో అన్ని మండలాలను కవర్ చేసే విధంగా ఉంటుంది. అదే రోజున వారు సందర్శించే గ్రామములో గ్రామసభ లేదా వార్డు సభ ప్రజా వేదికను ఏర్పాటు చేసి ప్రభుత్వం సాధించిన విజయాలను మరియు నెరవేర్చిన హామీలకు తప్పనిసరిగా తెలియజేస్తూ ప్రజలలో భాగం అవ్వనున్నారు.
ఇంటింటికి విసిట్ కు వెళ్ళాక ఆ రోజు వచ్చిన ముఖ్య అతిధి / ప్రజా ప్రతినిదుల వివరాలు మరియు ఎన్ని ఇళ్లకు విసిట్ చేసారో ఆయా వివరాలను గ్రామా సచివాలయం లో పంచాయతి కార్యదర్శి లేదా పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 6 డిజిటల్ అసిస్టెంట్ , వార్డు సచివాలయంలో అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ లేదా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెస్లోసింగ్ సెక్రటరీ వారి AP Seva Portal లాగిన్ లో హోమ్ పేజీ లో ఆప్షన్ ఇవ్వటం జరిగింది . PS / WAS వారు వారి సచివాలయం కోడ్ తో ఉన్న లాగిన్ లో డేటా అప్డేట్ చేయాల్సి ఉంటుంది . ఎవరో ఒకరు అప్డేట్ చేస్తే సరిపోతుంది . సచివాలయం లో ఇద్దరు చేయాల్సిన పని ఉండదు .
Start --> AP Seva Portal Login --> Click On ఇది మంచి ప్రభుత్వం --> Enter Visit Date , Total HH Visited , Name Of Chief Guest , Designation Of Chief Guest --> Submit
ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రాం [ Idi Manchi Prabhutvam Program ] లో ఇచ్చే పాంప్లెట్ లో ఉండే ముఖ్యమైన అంశాలు
అంశం 1 : నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీ తో 16437 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టటం
అంశం 2 : పెన్షన్లు ఒకేసారి 1000 రూపాయలు పెంచి 4000 ఇవ్వటం ఒకటైతే మొదటి నెల ఒక్కొక్కరికి ₹7,000 చొప్పున ఒకేరోజు 65 లక్షల 18 వేల మందికి అది కూడా ఇంటింటికి వెళ్లి 4408 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం దేశంలోనే ఇది ఒక తిరుగులేని సంక్షేమ చరిత్ర .
అంశం 3 : ప్రతినెల ఒకటో తారీకున ఉద్యోగుల జీతాలు ఇస్తున్నారు .
అంశం 4 : 1674 కోట్ల దాన్యం కొనుగోలు బకాయిలు చెల్లించి అన్నదాతను ఆదుకున్నారు .
అంశం 5 : స్థానిక సంస్థలకు 1452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశారు .
అంశం 6 : పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా కేవలం ఐదు రూపాయలతోనే ఆకలి తీర్చే 100 అన్న క్యాంటీన్లను పున ప్రారంభించడం.
అంశం 7 : ప్రజల కంటికి నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి ప్రజల ఆస్తులను భద్రత కల్పించారు.
అంశం 8 : విజయవాడ నగరం వరదలతో విలవిలలాడుతున్నప్పుడు పది రోజులపాటు బస్సులో ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు చంద్రబాబు గారు .