❁❁ యూనియన్ బడ్జెట్ 2022 ముఖ్యాంశాలు ❁❁
భారతదేశం యొక్క వృద్ధి రేటు 9.2 శాతంగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది ఈ వృద్ధి
అన్ని పెద్ద ఆర్థిక వ్యవస్థలో కెల్లా పెద్దది.
ఈసారి బడ్జెట్ లో నాలుగు రంగాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని గతిశక్తి యోజన, సమీకృత అభివృద్ధి, ఉత్పాదక అభివృద్ధి, ఆధారిత పెట్టుబడులు, పరిశ్రమలకు ఆర్థిక ఊతమివ్వడానికి ప్రాధాన్యత. డీబీటీ ద్వారా పేదలకు నేరుగా ఆర్థికసాయం.వచ్చే 25 ఏళ్లలో భారత్ను అగ్రదేశంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు
దేశంలో ఎక్కడి నుంచైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు సరికొత్త వ్యవస్థ. దేశవ్యాప్తంగా ఏకీకృత రిజిస్ట్రేషన్ పథకాన్ని(NGDRS) ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ 40 కోట్ల కేటాయింపు. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీ కి రూ. 50 కోట్ల కేటాయింపులు చేశారు
ఆదాయపు పన్ను రిటర్న్ల్లో పొరపాట్లు సవరించుకునేందుకు దరఖాస్తు చేసిన ఏడాది నుంచి 2 సంవత్సరాలలో మార్పులు చేసుకునేందుకు అవకాశం
క్రిప్టో కరెన్సీపై 30 శాతం పన్ను
2022-23 ఆర్థిక సంవత్సరంలో బ్లాక్చెయిన్, ఇతర సాంకేతికతలను ఉపయోగించి డిజిటల్ రూపాయిని జారీ చేయనున్న ఆర్బీఐ (RBI)
కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించిన కేంద్రం
మొబైల్ ఫోన్ ఛార్జర్ల ట్రాన్స్ఫార్మర్లు, కెమెరా లెన్స్లపై దిగుమతి సుంకాన్ని తగ్గింపు
కొన్ని రసాయనాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించాలని ఆర్థిక మంత్రి సీతారామన్ ప్రతిపాదన
స్టీల్ స్క్రాప్పై కస్టమ్ డ్యూటీ మినహాయింపును మరో ఏడాది పొడిగింపు
టాక్స్ స్లాబుల్లో ఎటువంటి మార్పు లేదు
దేశంలో వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు
కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి ప్రణాళిక
PM అవాస్ యోజన కింద ₹48 వేల కోట్లతో 80 లక్షల ఇళ్ళ నిర్మాణం.
PM ఆన్లైన్ విద్య కోసం 200 ఛానళ్ళు.
క్రెడిట్ గ్యారంటీ పథకానికి ₹2 లక్షల కోట్లు
త్వరలో డిజిటల్ చిప్ తో కూడిన పాస్ పోర్టులు జారీ..
1.5 లక్షల పోస్ట్ ఆఫీసుల్లో బ్యాంకింగ్ సర్వీసులు.
3.8 కోట్ల ఇళ్లకు మంచి నీళ్ళ పథకానికి ₹60 వేల కోట్లు.
ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత. చిరుధాన్యాల అభివృద్ధికి అదనపు ప్రోత్సాహం.
పర్వతమాల ప్రాజెక్టు కింద పర్యావరణ హితమైన అభివృద్ధి. పర్వతమాల ప్రాజెక్టులో 8 రోప్వేల అభివృద్ధిదేశంలో నాలుగుచోట్ల మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులు ఏర్పాటు.
మల్టీమోడల్ కనెక్టివిటీలో భాగంగా రైల్వేలతో ఇతర రవాణా సదుపాయాల అనుసంధానం.
ఎక్స్ప్రెస్ వే కోసం గతిశక్తి మాస్టర్ ప్లాన్, 25 వేల కిలోమీటర్ల హైవేల విస్తరణ.
దేశవ్యాప్తంగా 2022-23లో ప్రైవేటు సంస్థల ద్వారా 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ వెల్లడించారు.సాంకేతికత ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
2022-23లో భారత్ నెట్ ప్రాజెక్టు ద్వారా పీపీపీ పద్ధతిలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ విస్తరణ
మూడేళ్ళలో 400 వందే భరత్ రైళ్లు
జల జీవన్ మిషన్ కి 60000 కోట్ల కేటాయింపు
దేశీయ గింజల ఉత్పత్తి పెంచడానికి పథకాలు
ప్రభుత్వం EV బాటరీ మార్పిడి విధానాన్ని తీసుకురానుంది
100 కార్గో టెర్మినళ్ల ఏర్పాటు
హాస్పిటాలిటీ రంగానికి 5 లక్షల కోట్లు