Pradhan Mantri Garib Kalyan Anna Yojana Scheme - ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం

#

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం - Pradhan Mantri Garib Kalyan Anna Yojana Scheme






ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) అనేది భారత ప్రభుత్వం మార్చి 26 2020న ప్రకటించిన ఆహార భద్రత సంక్షేమ పథకం, భారతదేశంలో COVID-19 మహమ్మారి సమయంలో భారతదేశంలోని అత్యంత పేద పౌరులకు, అన్ని ప్రాధాన్యత గల కుటుంబాలకు (రేషన్ కార్డ్ హోల్డర్‌లు మరియు అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా గుర్తించబడిన వారికి) ఆహారం అందించడం ఈ పథకం లక్ష్యం. ఇందుకోసం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ధాన్యాన్ని అందించడం జరుగుతుంది.

PMGKAY ద్వారా ఏమి పంపిణి చేస్తారు?

PMGKAY ద్వారా ప్రతి వ్యక్తికి 5 కిలోల బియ్యం లేదా గోధుమలను (ప్రాంతీయ ఆహార ప్రాధాన్యతల ప్రకారం) మరియు రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి 1 కిలో పప్పును అందిస్తుంది. ఈ సంక్షేమ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార భద్రతా కార్యక్రమంగా గుర్తించబడింది.

ఎప్పటివరకు పంపిణి చేస్తారు?

ఈ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమాన్ని ఏప్రిల్ 2020 నుంచి పలు మార్లు పొడిగిస్తూ ప్రస్తుతం సెప్టెంబర్ 2024 వరకు ఉచిత రేషన్ ను పంపిణి చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఏపీ మరియు తెలంగాణ లో పంపిణి ఎలా ఉంది ?

తెలంగాణ లో ప్రతి నెల రేషన్ దుకాణాల నుంచి ఈ పంపిణి చేస్తున్నారు. ఏపీ లో మార్చ్ వరకు నెలలో 15 వ తేదీ నుంచి నెలాఖరు వరకు పంపిణి చేశారు. అయితే ప్రస్తుతం 4 నెలల పెండింగ్ రేషన్ ఉంది. ఇవి కలుపుకొని మొత్తం 5 నెలలకు గాను ఆగస్టు నుంచి కూపన్ల వారీగా రేషన్ పంపిణి చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అనగా ఒక్కో కుటుంబ సభ్యునికి ఐదు నెలలకి 5 కేజీల చొప్పున 25 కేజీల ఉచిత బియ్యం అందనుంది.

You can call on these numbers for any queries at 1800-180-2087, 1800-212-5512 and 1967

#

JOIN Our Govt Schemes Telegram Group

  • #
  • #
  • #
  • #